Mahabubnagar news: ఫిర్యాదులపై తక్షణ స్పందన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కార్యాలయానికి వివిధ సమస్యల నిమిత్తం వచ్చిన ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ జానకి ధరావత్ ఆదేశించారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 26 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ డి.జానకి క్షుణ్ణంగా పరిశీలించారు.
Read also: Bellampalli development: బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
SP Janaki addressing public issues
Mahabubnagar news: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం
ప్రజల సమస్యలను ఓర్పుతో విని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు పోలీసు శాఖపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికా బాధ్యత అని తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించి, చట్టపరమైన చర్యల ద్వారా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. బాధితులకు వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు స్పందనాత్మకంగా పనిచేయాలని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
తల్లిదండ్రుల పెళ్లి రోజున విషాదం: సర్ప్రైజ్ ఇవ్వబోయి అనంత లోకాలకు వైద్య విద్యార్థి

