Chandrababu Naidu: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ గత జగన్ చట్టాన్ని ప్రభుత్వం విపరీతంగా దుర్వినియోగం చేసిందని టిడిపి సీనియర్ కార్యకర్త ఈ. నిరంజన్ తెలిపారు.
రెండోరోజు మహానాడు కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ … పులివెందులలో నాగమ్మ అనే ఒక దళిత మహిళ హత్య జరిగితే, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళిన టిడిపి దళిత నాయకులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు గత ప్రభుత్వం పెట్టిందని తెలిపారు. రాజధాని భూములిచ్చిన ఎస్సీ,ఎస్టీ రైతులకు సైతం బేడీలు వేసి, వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టింది వైసీపి ప్రభుత్వం. కరోనా సమయంలో కేవలం మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను మరణించే వరకు వేధించిన గత ప్రభుత్వ పద్దతి
SC ST Atrocity law misuse in AP
Chandrababu Naidu: అట్రాసిటీ చట్టం దుర్వినియోగం
దళితులపై వారి కోసం విధానం ఎంటో దళిత డ్రైవర్ను హత్య చేసి, డోర్ డెలి వరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును మీ ప్రభుత్వం సత్కరించిన తీరును చూస్తే దళిత ప్రజల మానప్రాణాలు మీ దృష్టిలో ఎంత చులకనో తెలుస్తుంది. దళితులకు ఇతర కులాలకు మధ్య అంతరాలను పెంచి పోషించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఏ వర్గానికి సమస్య లేకుండా ఎస్సీ వర్గీకరణను చేసి దళిత వర్గానికి సాంఘీయ న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. దళిత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం జస్టిస్ పున్నయ్య కమీషన్ వేసి, ఆ కమీషన్ సూచించిన 42సిఫార్సులను అమలు పరిచి దళిత అభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మత్తులో ఏఎస్ఐ హల్చల్.. బిల్లు అడిగినందుకు హోటల్ ఓనర్పై దాడి

