Dailyhunt
గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

వార్త 2 weeks ago

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని గవర్నర్ అధికారిక నివాసం 'లోక్ భవన్'కు వెళ్లిన సీఎం, ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Read Also : Hyderabad Auto Drivers Protest: నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు

 Andhra Pradesh: CM Chandrababu Naidu visits Governor Abdul Nazeer

ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఇటీవలే గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి లోక్ భవన్‌కు తిరిగి వచ్చిన గవర్నర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని, యధావిధిగా విధుల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

మర్యాదపూర్వక భేటీ మాత్రమే

ఈ భేటీ కేవలం గవర్నర్ ఆరోగ్యాన్ని పరామర్శించేందుకు జరిగిన మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సుమారు కొంతసేపు జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ కోలుకుంటున్న తీరును, వైద్యులు అందిస్తున్న సూచనలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha