Guntur Crime: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 3 గంటల సమయంలో రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గుర్తించారు.
చీకటిని అదునుగా చేసుకుని వారు ఏదైనా పెద్ద దోపిడీకి స్కెచ్ వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Read Also:Sangareddy Fire Accident: సంగారెడ్డి నేషనల్ హైవేపై మంటలు: కెమికల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధం
Guntur Ponnuru Police Firing
Guntur Crime: దుండగుల చేతిలో ఆయుధాలు.. పోలీసులపై దాడి
అనుమానితుల వద్ద కట్టర్లు, ఇతర పదునైన ఆయుధాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఒక్కసారిగా పోలీసులపైకి రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు.ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సరోగసి స్కామ్: డాక్టర్ నమ్రత పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!

