Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు భారీ జరిమానా పడింది.
కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య ప్రవర్తనపై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించారు.
Read also: MI vs KKR live Score : ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన రహానే..
Hardik Pandya fined 10% match fee
అసలు ఏం జరిగింది?
కేకేఆర్ మ్యాచ్లో పది ఓవర్ పూర్తయ్యాక నాలుగో బంతి వేసిన అనంతరం హార్దిక్ పాండ్య తీవ్ర అసహనానికి లోనయ్యాడు. మైదానంలో తిరిగి వెళ్తున్న సమయంలో కోపంతో వికెట్లను బలంగా తన్ని కింద పడేశాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా వికెట్లను ధ్వంసం చేసినందుకు ఐపీఎల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మైదానంలో క్రీడా సామగ్రిని లేదా వికెట్లను ఉద్దేశపూర్వకంగా పాడుచేయడం ఐపీఎల్ నిబంధనల ప్రకారం నేరం.
Hardik Pandya: నిబంధనల ఉల్లంఘన – క్రమశిక్షణ చర్యలు
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం, గ్రౌండ్ ఎక్విప్మెంట్ లేదా క్రీడా వస్తువులను దుర్వినియోగం చేయడం నిషిద్ధం. ఒక కెప్టెన్గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హార్దిక్ ఇలా ప్రవర్తించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఈ సీజన్లో ఫామ్ లేమితో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్కు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం క్రీడాకారులందరికీ హెచ్చరికగా నిలుస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

