లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
Iran closes hormuz strait : రాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో వారంలోనే సంక్షోభంలో పడింది. ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై భారీ దాడులు చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
బీరూట్, బెకా వ్యాలీ, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లోని హెజ్బుల్లా కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది.
హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్
ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత ముఖ్యమైన హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండా జరుగుతుంది. ట్యాంకర్ల రాకపోకలు ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Also:Ibrahimpatnam: చైర్మన్ సుదర్శన్రెడ్డికి ఘన సన్మానం
Iran closes hormuz straitఉగ్రవాద స్థావరాలపై దాడులే: ఇజ్రాయెల్
లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడుల్లో కనీసం 112 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు. అయితే తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఇయల్ జమీర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ప్రకటిస్తూ, హార్ముజ్ జలసంధి మూసివేత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతులమీదుగా పుస్తె మెట్టెలు అందజేత

