Dailyhunt
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన..తలపట్టుకున్న అమెరికా

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన..తలపట్టుకున్న అమెరికా

వార్త 2 weeks ago

శ్చిమాసియాలో పరిస్థితులు భగ్గుమంటున్నాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్ నావికాదళం ఇటీవల చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో.. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది.

హార్ముజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ పాత స్థితికి చేరుకోదని, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఈ మార్గం పూర్వపు రీతిలో అందుబాటులో ఉండదని ఇరాన్ నావికాదళం స్పష్టం చేసింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి హార్ట్ వంటి ఈ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూనే.. అగ్రరాజ్యం అమెరికాకు, దాని మిత్రదేశం ఇజ్రాయెల్‌కు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియాలో గత కొంతకాలంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, క్షిపణి దాడులు మరియు డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదింట ఒక వంతు వాణిజ్యం జరుగుతుంది. అటువంటి కీలక మార్గాన్ని నియంత్రించడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల శక్తి తమకు ఉందని ఇరాన్ చాటిచెప్పింది.

Read Also: Khawaja Asif: "భారత్‌తో యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం"! ఖవాజా ఆసిఫ్

 Iran-USA War

Iran-USA War: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ నావికాదళ అధికారుల హెచ్చరికలు

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ ప్రాంతంలో చేస్తున్న సైనిక కార్యకలాపాలను తాము ఇకపై సహించబోమని, తమ ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏ చర్యకైనా దీటుగా సమాధానం ఇస్తామని ఇరాన్ నావికాదళ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇచ్చిన హెచ్చరికలు, ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్మూజ్ జలసంధిని మూసివేయడం లేదా అక్కడ ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నావికాదళం తమ రక్షణ వ్యవస్థలను ఆధునీకరించుకున్నామని, సముద్ర గర్భంలో క్షిపణులు, డ్రోన్ల ద్వారా ఏ క్షణమైనా శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రమేయం ఈ ప్రాంతంలో పెరగడాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పశ్చిమాసియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారని, నెతన్యాహు ఆదేశాల మేరకు అమెరికా ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ వంటి నాయకులు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఇరాన్ నావికాదళం చేసిన ఈ తాజా ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేయడం ద్వారా తమ పట్టును నిరూపించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ.. ఎవరీ రిని సంపత్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha