Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో జనసేన సభ రద్దు.. పోలీసుల దెబ్బకు కోర్టులోనూ నిరాశే!

హైదరాబాద్‌లో జనసేన సభ రద్దు.. పోలీసుల దెబ్బకు కోర్టులోనూ నిరాశే!

వార్త 2 weeks ago

Pawan Kalyan Hyderabad PressMeet: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ("తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం") నిర్వహించాలనుకున్న జనసేన పార్టీకి తెలంగాణ హైకోర్టులో గట్టి చుక్కెదురైంది.

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజే (మంగళవారం) సభ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకోగా, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ సెల్ దాఖలు చేసిన హౌస్ మోషన్ (అత్యవసర) పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Read Also :Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Pawan Kalyan Hyderabad PressMeet: శాంతిభద్రతల కారణాలతో పోలీసుల బ్రేక్

 Setback For Jana Sena

తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా దాదాపు 2,000 మంది ముఖ్య నేతలతో ఈ అంతర్గత సభ నిర్వహించాలని జనసేన భావించింది. అయితే, గచ్చిబౌలి ఐటీ హబ్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడం మరియు ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనపై కొన్ని సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో శాంతిభద్రతల (Law & Order) సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సైబరాబాద్ (శేరిలింగంపల్లి జోన్) పోలీసులు సభకు అనుమతిని నిరాకరించారు.

హైకోర్టులో జనసేనకు నిరాశ - కేవియట్ పిటిషన్ లింక్

పోలీసుల రిజెక్షన్ ఆర్డర్‌పై జనసేన మంగళవారం ఉదయం అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) ధర్మాసనం, ఇందులో ఇప్పటికిప్పుడు అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత (Urgency) లేదని స్పష్టం చేసింది. "కావాలనుకుంటే రెగ్యులర్ విధానంలో వెకేషన్ బెంచ్ (Vacation Bench) ముందు ఈ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు" అని పేర్కొంటూ హౌస్ మోషన్‌ను రిజిస్ట్రీ తిరస్కరించింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సభకు అనుమతులు ఇవ్వకూడదంటూ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ముందే కోర్టులో కేవియట్ (Caveat) పిటిషన్ దాఖలు చేయడం కూడా ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

హైకోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో గచ్చిబౌలి సభ పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక సంచలన పోస్ట్ చేశారు. "ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో విలేకరుల సమావేశం (Press Meet) నిర్వహిస్తాను. మా నాయకులతో కలిసి నిర్వహించే ఈ ప్రెస్‌మీట్‌కైనా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందో.. లేదో.. చూద్దాం!" అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సభ రద్దయిన నేపథ్యంలో సాయంత్రం జరగబోయే పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha