ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అంతర్జాతీయ సమాజం సమాయత్తమవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఈ జలమార్గంలో పాతిన మైన్లను (Mines) తొలగించే సామర్థ్యం తమకు ఉందని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి.
ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ కీలక ప్రకటన చేస్తూ, బెల్జియం, నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్స్ దేశాలకు సముద్రగర్భం లోని మైన్లను తొలగించే సాంకేతికత ఉందని వెల్లడించారు. ఈ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు ఐరోపా దేశాలు ‘ఎస్కార్ట్’ (సైనిక రక్షణ) సేవలను అందించనున్నాయి. నౌకాయానానికి అడ్డంకిగా ఉన్న పేలుడు పదార్థాలను తొలగించడం ద్వారా సముద్ర మార్గాన్ని సురక్షితం చేయడమే ప్రధాన లక్ష్యం.
Read Also: Justin Fairfax: వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఘాతుకం.. భార్యను చంపి తాను ఆత్మహత్య!
Strait of Hormuz
Strait of Hormuz: 40 దేశాల నేతల సమాలోచనలు
హర్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవడమే లక్ష్యంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ సదస్సుకు నాయకత్వం వహిస్తున్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సహా సుమారు 40 దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా లేదా వర్చువల్ పద్ధతిలో పాల్గొననున్నారు.ప్రపంచ ఇంధన సరఫరాను మరియు ఆర్థిక వ్యవస్థను ఇరాన్ బందీగా మార్చుకుందని బ్రిటన్ ప్రధాని తీవ్రంగా విమర్శించారు. దీనిని అడ్డుకోవడం ప్రపంచ దేశాల బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక ప్రత్యేక ‘అంతర్జాతీయ మిషన్’ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇరాన్పై ఆర్థిక దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడం. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) ప్రమాణాల ప్రకారం నౌకా సిబ్బందికి భద్రత కల్పించడం. పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం ద్వారా చమురు ధరలను నియంత్రించడం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

