Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం..  ఐదుగురు పోలీసులు మృతి

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసులు మృతి

వార్త 1 month ago

Haryana Road Accident: హర్యానాలోని నుహ్ జిల్లాలో మంగళవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అతివేగంతో వెళ్తున్న ఒక వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన తౌరు సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దులావత్ టోల్ ప్లాజా సమీపంలో జరిగింది.

Read Also : Zahirabad Road Accident:దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ అనంత లోకాలకు

 Five policemen killed in a horrific road accident in Haryana

Haryana Road Accident: అతివేగమే ప్రమాదానికి కారణం?

సమాచారం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో విధుల్లో ఉన్న ఈ ఐదుగురు పోలీసులు ఒక మహేంద్ర స్కార్పియో వాహనంలో పల్వాల్ వైపు వెళ్తున్నారు. దులావత్ టోల్ ప్లాజా సమీపంలో వాహనం అతివేగంతో ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. వాహనం అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న వేగానికి స్కార్పియో నుజ్జునుజ్జు అయింది.

ఘటనా స్థలంలోనే ఐదుగురి మృతి

ప్రమాదం జరిగిన తీరు ఎంత భయంకరంగా ఉందంటే, వాహనంలో ఉన్న ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. స్థానికులు, టోల్ సిబ్బంది సమాచారం అందించడంతో హర్యానా పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వాహనం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

19 మంది బాలికలను ట్రాప్ చేసిన అన్నదమ్ములు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha