Rangareddy crime: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ జలాశయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు, సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.
అయితే, నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు ముగ్గురిలో ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
Read also: Surat case: భార్యను చంపి సిమెంట్ పెట్టెలో పూడ్చిపెట్టిన భర్త.. లేఖతో వెలుగులోకి!
Rangareddy crime: మృతుల వివరాలు
మృతులను టోలీచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాబాజ్లుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు వెళ్లిన మరో యువకుడు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకోగా, స్థానికులు గమనించి అతడిని ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
కుటుంబాల్లో విషాద ఛాయలు
సరదాగా గడపాలని వెళ్లిన యువకులు శవాలై తిరిగి రావడంతో టోలీచౌకి ప్రాంతంలో, వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జలాశయాల వద్దకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, నీటి లోతు తెలియకుండా లోపలికి దిగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

