ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ, తాను జీవితంలో ఏది అనుకుంటే అది సాధించానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుండి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నానని ఆయన పేర్కొన్నారు.
తొలుత జిల్లా పరిషత్ ఎన్నికల్లో ZPTCగా గెలవాలనుకుని అనుకున్నది సాధించానని, ఆపై ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేశానని గుర్తు చేసుకున్నారు. 2014లో ఎంపీగా గెలవాలన్న కోరిక ఆ సమయంలో నెరవేరకపోయినా, పట్టువదలకుండా ప్రయత్నించి 2019లో అదే స్థానం నుండి విజయం సాధించడం తన పట్టుదలకు నిదర్శనమని ఆయన వివరించారు.
Read Also : కేసీఆర్పై కవిత సంచలన ఆరోపణలు

2034 వరకు రాష్ట్రానికే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న తన కల నిజమైందని రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. అయితే, ప్రస్తుతానికి తన దృష్టంతా తెలంగాణ అభివృద్ధిపైనే ఉందని స్పష్టం చేశారు. “నేను చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి అయ్యాను.. 2034 వరకు నేనే సీఎంగా కొనసాగుతాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను పటిష్టం చేయడమే కాకుండా, ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ఆయన వెల్లడించారు.
ఢిల్లీ పీఠంపై కన్నేసిన రేవంత్?
జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు వెళ్తారన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. 2034 ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన తర్వాతే, తాను జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. అంటే, మరో పదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లోనే చక్రం తిప్పి, ఆపై ఢిల్లీ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని ఆయన ముందస్తు సంకేతాలిచ్చారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకున్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మరియు సుదీర్ఘ రాజకీయ ప్రణాళికను ప్రతిబింబిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

