Dailyhunt
జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు

జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు

వార్త 1 week ago

YS Sharmila Comments : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

వైఎస్సార్ ఆశయాలపై ప్రశ్నలు

వైఎస్సార్ పేదలు, రైతులు, దళితులు, మైనారిటీల సంక్షేమం కోసం పాదయాత్ర ప్రారంభించారని షర్మిల గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడిగా ఆయన చేసిన ఆ పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

అయితే తండ్రి పేరును పార్టీ పేరులో పెట్టుకుని జగన్ ఆయన ఆశయాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ లౌకికవాదాన్ని పాటించారని, కానీ జగన్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆమె విమర్శించారు.

బీజేపీపై మద్దతు ఆరోపణ

వక్ఫ్ చట్టం, దళిత క్రిస్టియన్ రిజర్వేషన్లు, ఎఫ్‌సీఆర్‌ఏ చట్టం వంటి అంశాల్లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు జగన్ మౌనం వహించారని షర్మిల ఆరోపించారు. కేసులు, రాజకీయ భవిష్యత్తు భయంతో బీజేపీ ముందు మోకరిల్లుతున్నారని కూడా విమర్శించారు.

Read Also: Jaladhara-Jalaharati Program Nellore: సమర్థవంతంగా జలధార-జలహారతి అమలు చేయాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా

 YS Sharmila Comments

పాదయాత్ర కాదు.. ఆత్మవిమర్శన యాత్ర

జగన్ పాలనలో దళితులు, మహిళలు, మైనారిటీలపై జరిగిన ఘటనలు వైఎస్సార్ ఆత్మను కలచివేసే విషయాలేనని షర్మిల అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాదయాత్రకు నివాళి అర్పించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర అని షర్మిల తీవ్రంగా విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

NH. 544డి పరిధిలో భూసమస్యలు పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha