Janasena : తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో ఈ సభను భారీగా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే భద్రతా కారణాలను చూపుతూ సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సభకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
నాగబాబు సంచలన వ్యాఖ్యలు
సభ రద్దు నేపథ్యంలో జనసేన జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ కల్యాణ్ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు, ప్రత్యర్థులు ఎంత అణచివేయాలని ప్రయత్నించినా పవన్ కల్యాణ్ ప్రతి సవాల్ను అధిగమించి ముందుకు సాగుతారని అన్నారు. విజయాలు సాధించాలంటే కష్టపడాల్సిందేనని, అపజయాల నుంచి మరింత బలంగా బయటకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read also: Pawan Kalyan: హైదరాబాద్లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ
Janasenaరాజకీయంగా వేడెక్కిన వ్యవహారం
ఇటీవల పవన్ కల్యాణ్కు సంబంధించిన రాజకీయ వివాదాలు తెలంగాణలో చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించినట్లు సమాచారం. మరోవైపు జనసేన నాయకులు మాత్రం సభకు అనుమతి నిరాకరించడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని చాటుతామని పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేన తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

