గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన అప్డేట్ అయిన ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్ విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ముంబైలోని ప్రఖ్యాత జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) వేదికగా మే 18న మధ్యాహ్నం 3 గంటలకు అత్యంత వైభవంగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్తో బాలీవుడ్ మార్కెట్లోనూ సినిమాకు భారీ హైప్ తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Read Also : 'పెద్ది' యూనిట్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి

బాలీవుడ్ మీడియా టార్గెట్గా గ్రాండ్ ఈవెంట్
ఉత్తరాది మార్కెట్లో ఈ సినిమాను భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించేలా చేసేందుకు మేకర్స్ ముంబైని వేదికగా ఎంచుకున్నారు. నార్త్ ఇండియాలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘జియో స్టూడియోస్’ విడుదల చేస్తుండటంతో, ప్రమోషన్స్ ప్లాన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సన, ప్రెజెంటర్ సుకుమార్తో పాటు ఇతర ముఖ్య సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. హిందీ మీడియా సమక్షంలో జరగబోయే ఈ ఈవెంట్ ద్వారా ‘పెద్ది’ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది (జూన్ 3న ఓవర్సీస్ ప్రీమియర్స్ పడనున్నాయి). ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. రామ్ చరణ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్లో కనిపించబోతున్న ఈ ‘పెద్ది’ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలంటే జూన్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట.. 'కరుప్పు' మూవీకి కలెక్షన్లు ఎంతంటే?

