CM Vijay Karur visit: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జులై 10, 11 తేదీల్లో కరూర్ జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లాలో జరిగిన ఘోర తొక్కిసలాట దుర్ఘటన తర్వాత ఆయన తొలిసారి అక్కడకు వెళ్లనుండటంతో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో టీవీకే (TVK) పార్టీ నిర్వహించిన బహిరంగ సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఆ సభలో జరిగిన భారీ తొక్కిసలాటలో 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై జన సమూహాన్ని నియంత్రించలేకపోవడం, భద్రతా లోపాలపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
CM Vijay to tour Karur district on July 10 and 11.
CM Vijay Karur visit: బాధితులకు భరోసా.. గతాన్ని గుర్తుచేసుకుంటూ..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అప్పట్లో భద్రతా వైఫల్యాలు, జన సమూహ నియంత్రణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో సాగుతోంది. ప్రమాదం జరిగిన సమయంలోనే విజయ్ కరూర్కు వెళ్లాలని భావించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అప్పట్లో వీలుపడలేదు. ఆ నాడు వెళ్లలేకపోయినా.. ముఖ్యమంత్రి విజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వారందరినీ మామల్లపురానికి రప్పించి, వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. అంతేకాకుండా, తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. బాధితుల కుటుంబ అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని సహాయక చర్యలు అందిస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు.
ఇప్పుడు స్వయంగా కరూర్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి విజయ్, మరోసారి ఆయా బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కరూర్ జిల్లాలో పలు కొత్త అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కరూర్ పర్యటనతో ముఖ్యమంత్రి విజయ్ తన రాష్ట్రవ్యాప్త జిల్లాల పర్యటనలను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి భారీ మద్దతు పలికిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అందుతున్నాయో స్వయంగా సమీక్షించేందుకు ఆయన మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

