Karimnagar Crime : అమాయకులను నమ్మించి ప్రైవేట్ బ్యాంకులో ఖాతాలు తెరిపించి వాటి ద్వారా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడేవారు ఆ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి కోట్లు వివరాలను వెల్లడించారు.
సైబర్ నేరాలకు వినియోగించే న్యూలు ఖాతాలు కరీంనగర్ జిల్లా కేంద్రంగా నడుస్తున్నాయని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు .దీనిలో భాగంగా ఆర్బిఎల్ బ్యాంక్ (రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్) సిబ్బంది కొంతమంది ఏజెంట్లను పెట్టి సామాన్యులకు డబ్బు కొల్లగొట్టిన ఘటన కరీంనగర్ కమిషనర్ పోలీసులు బయటపెట్టారు.
Read Also: Tiger woods arrest : అతివేగంతో కారు.. గోల్ఫ్ దిగ్గజం అరెస్ట్
Karimnagar Crime: Cyber network centered in Karimnagar
అమాయకుల పేర్లపై ఖాతాలు
శుక్రవారం కమిషనరేట్ కేంద్రంలో సిపి గౌస్ ఆలం ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆశ చూపి ఖాతాలు తెరిపించి వాటిని నేరస్తులకు అప్పగించినట్లు గుర్తించారు. మ్యూ ఖాతాలను సృష్టించి వాటిని పర్యవేక్షించడం, అకౌంట్లో ఉన్నవారికి సైబర్ నేరస్తులు వారి అకౌంట్ వినియోగించుకున్నందుకు ఇచ్చే డబ్బు పర్యవేక్షి ంచేందుకు ఏజెంట్లు, మధ్యవర్తులు, ఖాతాదారులు అంటూ ఒక పద్ధతి ప్రకారం నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మ్యున్ ఖాతాల ద్వారా 12 కోట్ల 25 లక్షల 31 వేలు లావాదేవీలు జరగగా ఆర్బిఎల్ బ్యాంక్ న్యూ లు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 138 కోట్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.
Karimnagar Crime: 13 మందిని అరెస్టు
ఈ నేరానికి సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు సిపి వెల్లడించడంతోపాటు మీడియా ముందు హాజరపరిచారు. నిందితుల్లో బిల్ బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్ (52), ఆయేషా బేగం (30), తో పాటు బండారి సాయిరాం (30), హనుమాన్ల రంజిత్ (36), అలిగేటి మల్లేశం (37), భోగ రాకేష్ (35), బండి ప్రణయ్ (25), విభూది రామ్ కుమార్ (37), నాతర్ల శ్రీనివాస్ (39), కర్రి రాజు (35), కల్లెడ మహేందర్ కొండ నరహరి (37), ( కల్లెడ రాజేష్ (27) లు ఉన్నారు. వీరిపై నమోదైన ఎనిమిది కేసుల్లో కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

