Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్నాటక సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్

కర్నాటక సర్కార్‌పై ప్రహ్లాద్ జోషి ఫైర్

వార్త 1 week ago

Prahlad Joshi : ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సూచనలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.

కర్ణాటకలో పెరుగుతున్న అప్పులు, ధరల భారంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోషి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను దాచిపెట్టేందుకే సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read Also : Tamilnadu New Speaker: తమిళనాడు అసెంబ్లీలో నూతన శకం: స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ బాధ్యతలు

 Prahlad Joshi

Prahlad Joshi : నాయకత్వ లక్షణం

ఎక్స్ వేదికగా వేదికగా స్పందించిన ప్రహ్లాద్ జోషి.. "భారత్‌ను ఒకప్పుడు 'ఫ్రాజైల్ ఫైవ్' దేశాల జాబితాలోకి నెట్టింది కాంగ్రెస్ పాలనే. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది" అంటూ విమర్శించారు. ప్రజలను పొదుపు చేయమని, ఇంధన వినియోగం తగ్గించమని, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించమని ప్రధాని చేసిన సూచనలను కాంగ్రెస్ తప్పుగా అర్థం చేసుకుంటోందని జోషి విమర్శించారు. "ప్రపంచ ఆర్థిక అనిశ్చితి సమయంలో దేశాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకోవడం నాయకత్వ లక్షణం. కానీ కాంగ్రెస్‌కు మాత్రం ఉచిత హామీలు, రాజకీయ లాభాలే ముఖ్యమయ్యాయి" అని ఎద్దేవా చేశారు.

 Prahlad Joshi

ప్రజలపై ధరల భారం

అంతేకాదు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రహ్లాద్ జోషి. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని, రెవెన్యూ లోటు చరిత్రాత్మక స్థాయికి చేరిందని ఆరోపించారు. బెంగళూరు రోడ్లు దారుణంగా మారాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక నిరసనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంకంటే కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేల లెక్కలతోనే బిజీగా ఉన్నారని విమర్శించారు. గ్యారెంటీలు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలపై ధరల భారం మోపిందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. పాలు, విద్యుత్, ఇంధనం, రవాణా ఛార్జీలు సహా దాదాపు 48 రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగాయని అన్నారు. ప్రజలకు ఉపశమనం ఇస్తామని చెప్పి.. మరింత భారాన్ని మోపిందని విమర్శించారు. "ప్రధానిని ప్రశ్నించే ముందు మీ ప్రభుత్వం ఎందుకు అంతర్గత కలహాలు, పరిపాలనా లోపాలు, పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతోందో ప్రజలకు సమాధానం చెప్పండి" అంటూ సిద్ధరామయ్యకు ప్రహ్లాద్ జోషి సవాల్ విసిరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పాలనలో మేమే సీనియర్లు.. విజయ్‌పై ఉదయనిధి చమత్కారం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha