Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేతన్ అగర్వాల్ మృతి కేసు.. ప్రధాని మోదీకి తల్లి భావోద్వేగ లేఖ

కేతన్ అగర్వాల్ మృతి కేసు.. ప్రధాని మోదీకి తల్లి భావోద్వేగ లేఖ

వార్త 3 weeks ago

Ketan Agarwal Death Case: పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చేయాలంటూ ఆయన తల్లి రాఖీ అగర్వాల్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఒక భావోద్వేగపూరితమైన లేఖ రాశారు.

కంటి ముందే కొడుకు దూరమవడంతో తమ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కూలిపోయిందని ఆమె ఆ లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా కేసు విచారణలో ఆశించిన పురోగతి లేకపోవడాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

Read Also : Bengaluru Crime: కల చెదిరి కన్నీరే మిగిలే..నవవధువు ఆత్మహత్య!

 Ketan Agarwal death case: Mother’s emotional letter to PM Modi

Ketan Agarwal Death Case :న్యాయం ఆలస్యమైతే మరికొంత వేదన

తన కుమారుడి మరణానికి కారణమైన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతుండటం తమను మరింత కలచివేస్తోందని రాఖీ అగర్వాల్ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యమయ్యే ప్రతి రోజూ, మా కుటుంబం అనుభవిస్తున్న నరకయాతన మరింత పెరుగుతోంది అని విచారం వ్యక్తం చేశారు. కేతన్ మృతికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదని ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. విచారణను వీలైనంత వేగంగా పూర్తి చేసి, దోషులకు చట్టప్రకారం కఠినమైన శిక్షలు పడేలా చూడాలని వేడుకున్నారు. ఒక తల్లిగా న్యాయం కోసం తాను చేస్తున్న ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అండగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.

నడిరోడ్డుపై కాపాడాల్సిన ఖాకీనే కాలయముడయ్యాడు.. భార్యను కాల్చేసి కానిస్టేబుల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha