AP BJP New Presidents: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత చాటుకునేందుకు సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అమరావతి కేంద్రంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు, రాబోయే ఎన్నికల దృష్ట్యా కేడర్ను సమాయత్తం చేయడమే ఈ నియామకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
Read Also:Amaravati International Airport: ఏపీ వృద్ధికి నవశకం!
AP BJP New Presidents: జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై బీజేపీ స్పెషల్ ఫోకస్

ముఖ్యంగా పోలవరం జిల్లాకు బుల్లికొండలు దొర, మార్కాపురంకు పోశం వెంకటకృష్ణారావు, బాపట్లకు మువ్వల వెంకట రమణారావు మరియు అన్నమయ్య జిల్లాకు పులిరెడ్డి నరేంద్ర కుమార్రెడ్డిలను అధ్యక్షులుగా ఎంపిక చేశారు. ఈ కొత్త నాయకత్వం తక్షణమే తమ జిల్లాల్లో బాధ్యతలు చేపట్టి, ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. ఈ మార్పుల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

