AP New Pensions: ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల (New Pensions) కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
జూన్ నెల నుండి కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఎన్టీఆర్ భరోసా’ (NTR Bharosa) పథకం కింద కొత్త వితంతు పింఛన్ల జారీకి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read Also :AP FTVTDC: ఏపీ సినీ రంగానికి కొత్త కళ.. చైర్మన్గా భరత్ భూషణ్!
Grama Ward Sachivalayam Pensions
ఈ నిర్ణయంతో అర్హులైన వితంతువులకు జూన్ 12వ తేదీ నుండి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. దీని ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 4,000 నేరుగా వారి ఖాతాల్లోకి లేదా ఇంటి వద్దకే అందనున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా, పూర్తిగా ఉచితంగా ఈ పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
AP New Pensions: దరఖాస్తుకు కావలసిన పత్రాలు (Documents Required)
కొత్తగా వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి (Secretariat) వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రింది పత్రాలను జతచేయాలి:
- గుర్తింపు కార్డు (Identity Card) జిరాక్స్
- వైట్ రేషన్ కార్డ్ (White Ration Card)
- భర్త మరణ ధృవీకరణ పత్రం (Death Certificate)
- కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
- గుర్తింపు కార్డు అప్డేట్ హిస్టరీ (Update History) జిరాక్స్
సచివాలయంలో దరఖాస్తు ఫారమ్ను పూర్తి చేసి, ఈ పత్రాలను జత చేసిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన (Verification) జరుపుతారు. అర్హత ప్రమాణాల ప్రకారం అన్నీ సరిగ్గా ఉంటే, లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చి ప్రతి నెలా పింఛన్ అందిస్తారు.
అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)
వితంతు పింఛన్ మంజూరు కావడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది:
- వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే మహిళకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
- ప్రభుత్వ ఉద్యోగం: సదరు కుటుంబంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగిగానీ లేదా ప్రభుత్వ పెన్షనర్ గానీ ఉండకూడదు.
- ఆదాయపు పన్ను: కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ (Income Tax) చెల్లించేవారు ఉండకూడదు.
ఇంటి వద్దకే ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, నేత మరియు గీత కార్మికులకు ప్రభుత్వం నెలనెలా పింఛన్లు అందిస్తోంది. లబ్ధిదారుల వర్గాన్ని బట్టి నెలకు రూ. 4,000 నుండి గరిష్టంగా రూ. 15,000 వరకు ఆర్థిక సాయం అందుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుండి 4వ తేదీ లోపు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేస్తున్నారు. ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వస్తే, అంతకంటే ముందే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త పింఛన్లను జారీ చేయకపోవడంతో ఎంతోమంది నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వడంతో అర్హులైన పేద కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

