Prakash Raj Legal Notices: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చుట్టూ మరోసారి న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. హిందూ ధర్మం మరియు రామలక్ష్మణులపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
Read Also:VDxShouryuv: విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్

నోటీసులోని ముఖ్యాంశాలు
ఇటీవల ప్రకాశ్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయని నోటీసులో పేర్కొన్నారు.తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా..
రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా తిరుమల లడ్డూ వివాదం సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోర్టు నోటీసులు రావడంతో దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
క్యాన్సర్తో పోరాడుతూ మలయాళ బుల్లితెర నటుడు సిద్ధార్థ్ కన్నుమూత!

