Dailyhunt
క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన త్రిష.. యువతకు అదిరిపోయే మెసేజ్

క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన త్రిష.. యువతకు అదిరిపోయే మెసేజ్

వార్త 1 week ago

Trisha Casts Vote Tamil Nadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు (ఏప్రిల్ 23, 2026) అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

Read Also:Assembly elections: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మోడీ, ఖర్గే పిలుపు

Trisha Casts Vote Tamil Nadu Elections: క్యూలో నిలబడి ఓటు:

త్రిష తన తల్లితో కలిసి చెన్నై అభిరామాపురంలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ, ఆమె సాధారణ ఓటర్ల వలె క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చే వరకు వేచి చూశారు. ఓటు వేసిన అనంతరం తన వేలికి ఉన్న సిరా చుక్కను విలేకరులకు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

 Trisha Casts Vote Chennai 2026

యువతకు త్రిష విజ్ఞప్తి

పోలింగ్ కేంద్రం వద్ద త్రిష మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేకించి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్లకు ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.”దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలి” అని కోరారు.

తమిళనాడు ఎన్నికల చిత్రం

డీఎంకే (స్టాలిన్), ఏఐఏడీఎంకే (పళనిస్వామి), టీవీకే (విజయ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అల్వార్‌లో మొదలై.. ఢిల్లీలో ముగిసిన హింసాకాండ: నిందితుడు రాహుల్ మీనా కిరాతకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha