Indiramma Houses: తెలంగాణ వ్యాప్తంగా సొంత ఇంటి కల కలిగిన పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' (Indiramma Houses) పథకం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.
క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్లో 500 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సెక్రటేరియట్ (సచివాలయం) లో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also:Revanth Reddy: మీరు నాటిన మొక్కే నేడు పెద్ద వృక్షమైంది: సీఎం రేవంత్
లబ్ధిదారులకు అనుకూలంగా ప్రాజెక్ట్ డిజైన్

సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతం చేయడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- నియోజకవర్గమే ఒక యూనిట్: ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, నిర్మాణ ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకోనున్నారు.
- వలసల నివారణకు చర్యలు: లబ్ధిదారులు ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారో, వాటికి వీలైనంత సమీపంలోనే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీనివల్ల నిరుపేదలు ఉపాధి కోల్పోకుండా, తమ సొంత ప్రాంతాల్లోనే స్థిరపడే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రజా పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల బలోపేతంపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్న తహసీల్దార్ (MRO) ఆఫీసులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు (Sub-Registrar Offices) అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన శాశ్వత భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Epaper: epaper.vaartha.com
విద్యాశాఖకు మంత్రిని నియమించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - పువ్వాడ

