Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్నో - ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

లక్నో - ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

వార్త 1 day ago

Lucknow-Delhi Indigo Flight: లక్నో నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరాల్సిన ఇండిగో విమానానికి ఊహించని విధంగా బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

అయితే, భద్రతా సిబ్బంది గంటలపాటు జరిపిన ముమ్మర తనిఖీల తర్వాత అది కేవలం ఆకతాయిల పని అని, నకిలీ బెదిరింపు (Hoax) అని తేలడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

 Lucknow Airport Bomb Scare

read also: Varavara Rao: వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏకు నోటీసులు జారీ!

టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ మెసేజ్

లక్నో ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E2111) లో ఈ భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం 10:45 గంటలకు విమానం రన్‌వే పైకి వెళ్లాల్సి ఉండగా.. టాయిలెట్‌లోని ఒక టిష్యూ పేపర్‌పై చేతిరాతతో కూడిన ఒక నోట్ విమాన సిబ్బంది కంటపడింది. అందులో విమానంలో బాంబు అమర్చినట్లు రాసి ఉండటంతో సిబ్బంది తక్షణమే అలర్ట్ అయి భద్రతా విభాగాలకు సమాచారం అందించారు.

Lucknow-Delhi Indigo Flight: రంగంలోకి బాంబ్ స్క్వాడ్.. సురక్షితంగా ప్రయాణికులు

హెచ్చరిక అందిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు విమానంలోని 180 మంది ప్రయాణికులను అత్యవసరంగా కిందకు దించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించి, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అణువణువూ గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది తప్పుడు సమాచారమని అధికారులు అధికారికంగా ప్రకటించారు.

కన్నూర్ ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే..

ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఒక అనుమానాస్పద వాతావరణం ఏర్పడింది. ముంబై నుంచి కన్నూర్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయిన తర్వాత, టాయిలెట్ డస్ట్‌బిన్‌లో ఒక కాగితం ముక్క లభించింది. దాన్ని బాంబు బెదిరింపుగా భావించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన పోలీసులు.. ఆ నోట్‌లో ఎలాంటి బాంబు బెదిరింపు లేదని, సిబ్బంది కేవలం అపోహ పడ్డారని స్పష్టం చేశారు.

అప్రమత్తమైన విమానయాన సంస్థలు

ఇటీవలి కాలంలో విమానాలకు వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు వస్తుండటంతో విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్ భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందస్తు నిఘాను కఠినతరం చేశారు. కాగా, లక్నో ఘటనలో టిష్యూ పేపర్‌పై ఆ బెదిరింపు నోట్ రాసిన వికృత బుద్ధి గల వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు విమానాశ్రయం, విమాన పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

176 ఏళ్లలో ఎన్నడూ లేని ఎండలు.. రికార్డ్ సృష్టించిన మే నెల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha