Dailyhunt
లోక్ సభ సీట్ల పునర్విభజనపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ

లోక్ సభ సీట్ల పునర్విభజనపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డి లేఖ

వార్త 1 week ago

Lok Sabha Delimitation: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై దక్షిణాది రాష్ట్రాల గళాన్ని వినిపిస్తూ టీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు స్టాలిన్, సిద్ధరామయ్య, పినరయి విజయన్ వంటి నేతలకు లేఖలు పంపించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పెంపు చేపడితే, పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు మరియు సీట్ల పెంపును ముడి పెడుతూ గందరగోళం సృష్టిస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల మాటకు విలువ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read also: TG Politics: జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

CM Revanth Reddy letter to CM Chandrababu

Lok Sabha Delimitation: దక్షిణాది రాష్ట్రాల ఏకతాటిపైకి రావాల్సిన సమయం

సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఈ లేఖల ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరగడం, దక్షిణాదిలో జనాభా నియంత్రణ విజయవంతంగా అమలు కావడం రాజకీయంగా మనకు శాపంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారనే విషయం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

రాజకీయ ప్రాతినిధ్యంలో శిక్ష విధిస్తున్నట్లుగా ఉందన్న రేవంత్

లోక్సభ స్థానాలను 543 నుండి 850కి పెంచితే, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల సీట్లు 80 నుంచి ఏకంగా 120కి పెరిగే అవకాశం ఉండగా, దక్షిణాది రాష్ట్రాల వాటా ఆ నిష్పత్తిలో పెరగదు. అంటే, దేశాభివృద్ధికి భారీగా పన్నులు చెల్లిస్తూ, విద్యా, వైద్య రంగాల్లో పురోగతి సాధించినందుకు గాను దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యంలో శిక్ష విధిస్తున్నట్లుగా ఉందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సీట్ల సంఖ్య సమస్య మాత్రమే కాదని, దేశ విధాన నిర్ణయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం కనుమరుగయ్యే ప్రమాదమని ఆయన నొక్కి చెప్పారు.

పరిష్కారంగా వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన

ఈ సంక్లిష్ట సమస్యకు పరిష్కారంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు. కేవలం జనాభానే ప్రాతిపదికగా తీసుకోకుండా, పెరిగే సీట్లలో సగభాగాన్ని మాత్రమే జనాభా ఆధారంగా కేటాయించాలని ఆయన సూచించారు. మిగిలిన సగం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం (జీఎస్డిపీ) పన్నుల చెల్లింపు, అక్షరాస్యత మరియు ఇతర అభివృద్ధి సూచికల ఆధారంగా కేటాయించాలని స్పష్టం చేశారు. అప్పుడే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని, దేశాభివృద్ధిలో పోటీతత్వం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పదవి పోయిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు భద్రత తొలగింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha