Dailyhunt
లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 8 మంది దుర్మరణం

లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. 8 మంది దుర్మరణం

వార్త 1 week ago

Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెహ్రీ గర్వాల్ జిల్లాలోని చంబా-కోటీ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక వాహనం అదుపుతప్పి 300 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

ఈ భీకర ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also:Bengal Election Violence: ముర్షిదాబాద్‌లో బాంబుల మోత.. హుమాయున్ కబీర్ వాహనంపై దాడి!

సహాయక చర్యలు ముమ్మరం

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను వెలికితీసి, తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 Vehicle plunges into valley.. 8 people die

Uttarakhand Road Accident: ప్రమాదానికి కారణాలు

కొండల మధ్య ఉండే ఈ రహదారిపై మలుపు వద్ద వాహనం అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

భార్య తల నరికి, చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha