Director Nandini Reddy: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా కుటుంబ కథా చిత్రం 'మా ఇంటి బంగారం' థియేటర్లలో ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేక చిన్న బ్రేక్ తీసుకున్న నందిని రెడ్డి.. ఈ సినిమాతో తనదైన క్లాసిక్ మేకింగ్ స్టైల్ను, గుండెలను పిండేసే ఎమోషన్స్ను అద్భుతంగా పండించి ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు. ఈ బ్లాక్బస్టర్ హిట్తో ఆమె టాలీవుడ్లో గ్రాండ్ కమ్బ్యాక్ ఇచ్చారంటూ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, దర్శకులు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Read Also :Peddi Movie: 'పెద్ది' టీమ్తో యూకే వెళ్లనున్న రామ్ చరణ్
Director Nandini Reddy: స్క్రీన్ ప్లే మ్యాజిక్ - పెరిగిన మార్కెట్ వాల్యూ

‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ చిత్రాల తర్వాత నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదేనంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.కమర్షియల్ హంగుల కంటే కథలోని భావోద్వేగాలనే నమ్ముకుని నందిని రెడ్డి ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతుండటంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్లీన్ హిట్తో నందిని రెడ్డి మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. టాలీవుడ్కు చెందిన పలువురు క్రేజీ యంగ్ హీరోలు, టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలు (Production Houses) ఆమెతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే రెండు పెద్ద బ్యానర్లు ఆమెకు అడ్వాన్స్లు ఇచ్చి కథలు సిద్ధం చేయమని కోరినట్లు సమాచారం.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల

