Mogudampally Tanker Accident: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ సమీపంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కెమికల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
జాతీయ రహదారిపై ఉలిక్కిపాటు
మాడ్గి సమీపంలోని నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో ట్యాంకర్ నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపివేశారు. అయితే, లోపల ఉన్నది రసాయనం కావడంతో మంటలు క్షణాల్లో ట్యాంకర్ మొత్తానికి వ్యాపించాయి. మంటల ఉధృతికి దట్టమైన పొగలు అలుముకోవడంతో జాతీయ రహదారిపై ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Read Also : బండి సంజయ్ తప్పు చేశాడన్న మంత్రి పొన్నం ప్రభాకర్
Mogudampally Tanker Accident: బూడిదైన ట్యాంకర్ - పోలీసుల విచారణ
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న చిరాగ్పల్లి పోలీసులు(Mogudampally Tanker Accident) అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

