Dailyhunt
మహిళలకు రూ.3000 ఆర్థిక సాయం- బీజేపీ మేనిఫెస్టో

మహిళలకు రూ.3000 ఆర్థిక సాయం- బీజేపీ మేనిఫెస్టో

వార్త 1 week ago

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శుక్రవారం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించింది. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చొరబాటుదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేసింది.

బంగాల్​లోని ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బంగాల్​ ఎన్నికల కోసం బీజేపీ శుక్రవారం సంకల్ప పత్రం (మేనిఫెస్టో) విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ సంకల్ప పత్రం రైతులు, మహిళలు, యువతకు మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు.

Read Also: HDFC Banking Services Down: రేపు తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలు బంద్!

 BJP Manifesto

BJP Manifesto: చొరబాటుదారులపై డిటెక్ట్​, డిలీట్​, డిపోర్ట్

మరోవైపు అధికారంలో ఉన్న మమత బెనర్జీ ప్రభుత్వంపై అమిత్​ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 ఏళ్ల తృణమూల్​ కాంగ్రెస్​ పాలన ప్రజలకు ఒక పీడకలగా మారిందని విమర్శించారు. చొరబాట్లను, సరిహద్దు భద్రతను ప్రధాన ఎన్నికల అంశాలుగా బీజేపీ పరిగణిస్తోంది. అందుకే బంగాల్​లో తమ సర్కార్ ఏర్పడితే చొరబాటుదారులపై డిటెక్ట్​, డిలీట్​, డిపోర్ట్​ (గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం) విధానాన్ని అనుసరిస్తుందని అమిత్​ షా స్పష్టం చేశారు. ఈ విషయంతో తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్​’ విధానంతో ముందుకెళ్తుందని తేల్చిచెప్పారు. బంగాల్​లోని పౌరులందరికీ ఒకే చట్టం ఉండేలా చర్యలు తీసుకుంటామని అమిత్​ షా పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రకృతితో చెలగాటాలొద్దు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha