Bhopal crime: అశోక్నగర్ జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక బురఖా ధరించి తన స్వగ్రామానికి చేరుకోవడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హిందూ కుటుంబానికి చెందిన తన కుమార్తెను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురై నిలదీయగా, గత నాలుగు నెలలుగా తాను అనుభవిస్తున్న నరకాన్ని ఆమె వివరించింది.
Read Also:Vijayawada Crime: ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
ప్రేమ పేరుతో వల.. మత మార్పిడికి ఒత్తిడి
నాలుగు నెలల క్రితం రైల్వే స్టేషన్లో పరిచయమైన అల్తమాష్ అనే యువకుడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలిని భోపాల్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. బాధితురాలితో పాటు మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా ఇదే విధంగా ట్రాప్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అల్తమాష్తో పాటు అర్హాన్ ఖాన్, అహత్ ఖాన్ అనే నిందితులు కలిసి ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Bhopal crime: పోలీసుల చర్యలు – పరారీలో నిందితులు
ఈ ఘటనపై హిందూ సంఘాల మద్దతుతో బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై అత్యాచారం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం, మరియు మత స్వేచ్ఛ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అశోక్ నగర్ ఎస్డీఓపీ వివేక్ శర్మ తెలిపారు. ప్రధాన నిందితుడు అల్తమాష్ ఇప్పటికే మరో కేసులో జైలులో ఉండగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మైనర్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ ముఠా వెనుక ఉన్న మూలాలను వెలికితీసేందుకు లోతైన విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
నువ్వు చాలా సన్నగా ఉన్నావని భర్త కామెంట్.. మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

