Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మల్లన్న భక్తులకు రైల్వే తీపి కబురు

మల్లన్న భక్తులకు రైల్వే తీపి కబురు

వార్త 1 week ago

Komuravelli Mallanna Temple Train: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

మనోహరాబాద్‌-సిద్దిపేట్‌ రైల్వే లైన్‌లో కొమురవెల్లి మార్గంగా భక్తుల వేళలకు అనుకూలంగా ఉండేలా కొత్త డెమూ (DEMU) రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also :Vijayawada durga gudi: దుర్గమ్మ భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్

ప్రస్తుత రైళ్ల వల్ల భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు ఉదయం 10:35 గంటలకు బయల్దేరే డెమూ రైలు కొమురవెల్లికి చేరుకునే సరికి మధ్యాహ్నం దాటిపోతోంది. ఆలయానికి చేరుకునే సరికే మధ్యాహ్న దర్శన వేళలు ముగిసిపోతుండటంతో తిరిగి ఆలయం తెరిచే వరకు భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దర్శనం ముగిశాక అదే రోజు తిరిగి సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనువైన రైలు సదుపాయం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబాలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా, రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారు.

కొత్త రైలు మంజూరు ప్రక్రియ - 4 కీలక దశలు

కొత్త డెమూ రైలును పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తిస్థాయి ప్రక్రియను ప్రారంభించారు:

1.ట్రాఫిక్ సర్వే & ఆదాయ నివేదిక:

కొమురవెల్లి ఆలయానికి వచ్చే భక్తులు మరియు ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య ఆధారంగా ప్రయాణికుల రద్దీ, అంచనా ఆదాయం మరియు నిర్వహణ వ్యయాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తారు.

2.టైమ్‌టేబుల్ & స్టాప్‌ల రూపకల్పన:

ఉదయం వేళ కొమురవెల్లికి చేరుకుని, సాయంత్రం తిరిగి వచ్చేలా ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను తయారు చేస్తారు. రైలు వేళలు, కొమురవెల్లి సహా ఇతర కీలక స్టేషన్లలో హాల్ట్‌లను నిర్ణయిస్తారు.

3.లైన్ కెపాసిటీ & సిగ్నలింగ్ తనిఖీ:

ఈ మార్గంలో నడిచే ఇతర రైళ్లకు అంతరాయం కలగకుండా రూట్ కెపాసిటీ, సిగ్నలింగ్, క్రాసింగ్ ప్రాసెస్ మరియు స్టేషన్ల సామర్థ్యాన్ని పరిశీలించి రూట్ క్లియరెన్స్ ఇస్తారు.

4.రైల్వే బోర్డు ఆమోదం:

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (GM) ఆమోదం తెలిపిన అనంతరం నివేదికను రైల్వే బోర్డు మరియు టైమ్‌టేబుల్ కమిటీకి పంపుతారు. అనుమతులు వచ్చాక డెమూ రెక్ (Rake) కేటాయిస్తారు.

Komuravelli Mallanna Temple Train: పట్టాలెక్కడానికి ఎంత సమయం పడుతుంది?

సర్వే, లైన్ కెపాసిటీ పరిశీలన, టైమ్‌టేబుల్ తయారీ మరియు రైల్వే బోర్డు తుది ఆమోదం వంటి అన్ని ప్రక్రియలు పూర్తయి కొత్త డెమూ రైలు అందుబాటులోకి రావడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నెల 13 నుండి శ్రావణమాసం స్టార్ట్.. ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha