Dailyhunt
మల్లన్న సేవలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్

మల్లన్న సేవలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్

వార్త 2 weeks ago

Srisailam: శ్రీశైల మల్లన్న దర్శనార్థమై శనివారం నాడు ఏపీ ఎస్టి కమిషన్ చైర్మన్ చోళ బొజ్జి రెడ్డి శ్రీశైలం కు చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే ఆలయ ఈవో ఎం.

శ్రీనివాసరావు,అర్చక స్వాములు,సాదరంగా ఘన స్వాగతం పలికారు.స్వామివారికి అభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి అలంకార ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం వల్లించగా,అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.తదుపరి ఆల ఈవో స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల చిత్రపటంను చైర్మన్ కు బహుకరించారు. తదుపరి శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో చెంచుల సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha