Ponnam Prabhakar in Srisailam: .శ్రీశైలం ఏప్రి ల్ 26: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు మల్లన్న దర్శనార్థమై ఆలయం వద్దకు చేరుకున్నా రు.
వారికి ఆలయ రాజ గోపురం వద్ద ఏఈవో వెంకటేశ్వరరావు,ప్రజా సంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు,అర్చక స్వాములు సాదర స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
Read Also: Lakshmi Narayana Swamy Brahmotsavam: లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలి: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
Ponnam Prabhakar in Srisailam
అనంతరం అమ్మవారి అలంకార ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం వల్లించగా,అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.తదుపరి అధికారులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామి అమ్మవార్ల చిత్రపటంను మంత్రికి బహుకరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

