TMC MPs : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని రీతిలో పెను భూకంపం సంభవించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు చేస్తూ ఆ పార్టీకి చెందిన 20 మంది అసంతృప్త ఎంపీలు లోక్సభ స్పీకర్ కార్యాలయానికి లేఖ సమర్పించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో మమతకు వ్యతిరేకంగా స్పీకర్ ఆఫీస్కు చేరిన రెబల్ ఎంపీల జాబితాలో ఉన్న 19 మంది కీలక నేతల పేర్లను ప్రముఖ వార్తా సంస్థ ‘ANI’ అధికారికంగా బయటపెట్టింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఏకఛత్రాధిపత్యానికి, మమతా బెనర్జీ తిరుగులేని నాయకత్వానికి ఈ అంతర్గత తిరుగుబాటు ఒక పెద్ద సవాలుగా మారిందని జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : త్వరలో పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్ రైలు.. రైల్వే మంత్రి ప్రకటన!

రెబల్స్ జాబితాలో సాయోనీ ఘోష్, యూసఫ్ పఠాన్.. దీదీకి షాక్ ఇచ్చిన ప్రముఖులు!
మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో పార్టీలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న నేతలతో పాటు సెలబ్రిటీ ఎంపీలు కూడా ఉండటం విశేషం. ‘చోటా దీదీ’గా పేరుగాంచిన సాయోనీ ఘోష్, మాజీ భారత క్రికెటర్ యూసఫ్ పఠాన్లతో పాటు కాకోలీ ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్, బాపీ హల్దార్, షర్మిలా సర్కార్, ప్రసున్, జగదీశ్, అసిత్, అరూప్ చక్రవర్తి, ప్రముఖ నటి రచనా బెనర్జీ, రహ్మాన్, అబూ ఖాన్, మిథాలీ, మాలా రాయ్, సోరెన్, దీపక్, మాలియా మరియు పార్థా భౌమిక్లు ఈ అసమ్మతి లేఖపై సంతకాలు చేసినట్లు తేలింది. ఇంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాదరణ ఉన్న ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి స్పీకర్ కార్యాలయాన్ని ఆశ్రయించడం బెంగాల్ అధికార పీఠాన్ని కదిలించివేస్తోంది. ఈ తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందోనన్న తీవ్ర ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

