Payyavula Keshav: శుక్రవారం అనంతపురం రామ్ నగర్లోని ఆర్థిక మంత్రివర్యుల కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఆయన చిన్ననాటి స్నేహితులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Read Also:Anantapur: అనంతపురంలో ఆర్. శ్రీనివాసులకు ఘన సన్మానం
వారంతా 1969 నుంచి 1976 వరకు అనంతపురంలోని చర్చి పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులు కావడం విశేషం.చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించిన మంత్రివర్యులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం మిత్రులు మంత్రివర్యులను సత్కరించి తమ అభిమానాన్ని తెలియజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

