Nellore: నెల్లూరు జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల ఎక్స్గ్రేషియా, బీమా చెక్కులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా ఎఆర్పిసి రమేష్ బాబు కుటుంబానికి రూ.
1 కోటి 12 లక్షలు, పీసీ శివకుమార్ కుటుంబానికి రూ. 1 కోటి 10 లక్షలు ప్రమాద బీమా మొత్తాలు SBI బ్యాంకు తరఫున అందజేశారు.
Read Also:Amaravati Development : చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ
Nellore: ప్రభుత్వ ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు
ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ… విధుల్లో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి. CH. సౌజన్య, బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

