మెక్సికోలో శాంతిభద్రతల పరిస్థితి మరోసారి ఆందోళనకరంగా మారింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్జింగో పట్టణంలో ఒక దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఒక చిన్నారితో సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
మృతులలో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలు కానీ, కాల్పుల వెనుక ఉన్న అసలు కారణాలు కానీ ఇంకా తెలియరాలేదు. స్థానిక పోలీసులు, భద్రతా సంస్థలు ఈ ఉదంతంపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నాయి. ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Read Also: Bangkok Train Crash: బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
Shooting In Mexico
Shooting In Mexico: పెరుగుతున్న డ్రగ్ కార్టెల్ హింస – వలస బాటలో ప్రజలు
మిడిల్ మెక్సికో ప్రాంతంలో గత కొంతకాలంగా డ్రగ్ కార్టెల్ల (డ్రగ్స్ మాఫియా ముఠాలు) మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ప్యూబ్లా రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హుహుట్లాన్ ఎల్ గ్రాండే నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు, ఆ తర్వాత రాజధాని నగరంలో జరిగిన మరో దాడిలో ముగ్గురు మరణించారు. ఈ వరుస హింస కారణంగా ప్రాణభయంతో తెహ్విట్జింగో పరిసర ప్రాంతాల నుండి దాదాపు 1,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాయి. మరో నెల రోజుల్లో ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup) టోర్నమెంట్కు మెక్సికో ఆతిథ్యం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ఘోరకలి జరగడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది. జూన్ 11న మెక్సికో సిటీలో జరిగే ప్రారంభ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో మెక్సికో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం మెక్సికోలోని మెక్సికో సిటీ, మోంటెర్రే, గ్వాడలజారా నగరాలు సిద్ధమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

