Dailyhunt
మిస్ ఇండియా ఎర్త్ 2019 సయాలీ సుర్వే కిడ్నాప్?

మిస్ ఇండియా ఎర్త్ 2019 సయాలీ సుర్వే కిడ్నాప్?

వార్త 3 weeks ago

Sayali Surve Missing: పుణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో నివసిస్తున్న మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే, ఆమె నలుగురు పిల్లలు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు.

కొన్నేళ్ల క్రితం ఇస్లాం మతంలోకి మారిన సయాలీ, ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుని తన పేరును అతీజాగా మార్చుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే భర్త మరియు అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయని ఆమె గతంలో ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె తన నలుగురు పిల్లలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారి, తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు.

Read Also:Pema Khandu Corruption : రూ.1,270 కోట్ల కాంట్రాక్టులపై CBI దర్యాప్తు

Sayali Surve Missing: అత్తింటి వారిపై కిడ్నాప్ ఆరోపణలు.. పోలీసుల దర్యాప్తు

 Former Miss India Earth, missing along with four children-Police launch a search.

సయాలీ తిరిగి హిందూ మతంలోకి మారిన కొద్ది రోజులకే ఆమె తన పిల్లలతో సహా కన్పించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన కుమార్తెను మరియు మనవళ్లను భర్త, అత్తింటి వారే కిడ్నాప్ చేశారని సయాలీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత మార్పిడికి అంగీకరించని అత్తింటి వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. పింప్రి-చించ్వాడ్ పోలీసులు ఈ ఘటనపై మిస్సింగ్ మరియు కిడ్నాప్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడు, కేరళలో అధికార మార్పు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha