Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MP అర్వింద్ కు సీఎం రేవంత్ కౌంటర్

MP అర్వింద్ కు సీఎం రేవంత్ కౌంటర్

వార్త 1 week ago

CM Revanth Vs MP Arvind : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగడం లేదని, ఒకవేళ కొనుగోళ్లు చేయడం చేతకాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగిపోవాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు.

ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి బండి సంజయ్‌లను టార్గెట్ చేస్తూ.. గత 12 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం వెలగబెట్టారో ముందుగా వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? స్విస్ బ్యాంకు నుంచి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో వేశారా? లేక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

Read Also : పేరు మార్చుకుంటా అంటూ కెసిఆర్ కు రేవంత్ సవాల్

మోదీ దిగిపోతే రాహుల్ గాంధీ చేసి చూపిస్తారు: రేవంత్ సవాల్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమ నినాదాల్లో ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి విమర్శించారు. చేతకానితనం తమది కాదు, దశాబ్ద కాలంగా దేశ ప్రజలను వంచిస్తున్న కేంద్ర ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. పీఎం మోదీ ప్రధాని కుర్చీ నుంచి దిగిపోతే.. ఆ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూర్చోబెట్టి, తాము దేశవ్యాప్తంగా నిరుద్యోగ నిర్మూలన, నల్లధనం రికవరీ మరియు రైతుల అభ్యున్నతి వంటి ప్రతి హామీని అక్షరాలా నెరవేర్చి చూపిస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవసాయ కొనుగోళ్లు మరియు కేంద్ర-రాష్ట్ర నిధుల వివాదం చుట్టూ తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha