CM Revanth : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (kcr)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరంటూ లేదని స్పష్టం చేసిన సీఎం, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో తమ ఇందిరమ్మ ఇళ్లను పోల్చి చూసుకోవాలని డిమాండ్ చేశారు. “బీఆర్ఎస్ నాయకులు కేవలం తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన ఊళ్లల్లోనే ఓట్లు అడగాలి, నేను మాత్రం ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్కు ఓట్లు అడుగుతాను. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్కు కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా” అంటూ రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, ‘థూ.. మీదీ ఓ బతుకేనా?’ అంటూ ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
Read Also : రాబోయే 2 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!

అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలి: పౌరుషం ఉంటే తేల్చుకుందామన్న సీఎం
కేసీఆర్ పదేళ్ల సుదీర్ఘ పాలనలో చేయలేకపోయిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులను తాను కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే చేసి చూపించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై మరియు గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కేసీఆర్కు నిజంగా పౌరుషం, దమ్ము ఉంటే అసెంబ్లీకి వచ్చి తనతో నేరుగా చర్చలో పాల్గొనాలని, సభలోనే ఎవరు ఏం చేశారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు, విసిరిన రాజకీయ సవాల్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

