Dailyhunt
Music Road: దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

Music Road: దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

వార్త 1 month ago

భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజిక్ రహదారి (Music Road) ముంబయిలో ప్రారంభమైంది. దేశ రహదారి రంగంలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది. ముంబయి నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కోస్టల్ రోడ్లో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజిక్ రోడ్డును ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు .బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు.

Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

6.21 కోట్లు ఖర్చు

దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని 'జయ హో' పాట లోపలి ఉన్నవారికి వినిపిస్తుంది.రంబుల్ స్ట్రిప్‌లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు,

రోడ్డు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు 'జయ హో' పాట ట్యూన్‌ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు బీఎంసీ రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. నారీమన్ పాయింట్ వద్ద టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్‌సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్డును ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Flipkart: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha