Sobhita Dhulipala: తెలుగు నటి శోభిత ధూళిపాళ, అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత కూడా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న జీవిత సూత్రం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also : బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. మాస్ సాంగ్తో రచ్చ
Sobhita Dhulipala: “We should live as we please.. We should respect ourselves!”
తెలుగు మహిళల ఘనతపై ప్రత్యేక వీడియో
దుబాయ్కు చెందిన ప్రముఖ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళలను అభినందిస్తూ ఒక ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఈ గౌరవప్రదమైన జాబితాలో శోభిత ధూళిపాళ పేరును కూడా ప్రస్తావించారు. ప్రపంచ వేదికలపై తెలుగు వారి ప్రతిభను చాటుతున్న మహిళలందరినీ ఒకే చోట చేర్చి గౌరవించడం విశేషం.
“మనకు మనం నిజాయతీగా ఉండాలి”
శ్రీలత పోస్ట్పై స్పందించిన శోభిత, తన మనసులోని మాటలను పంచుకున్నారు. జీవితంలో మనం చేసే ప్రతి పని మన మనసు చెప్పిన దారిలోనే ఉండాలని, అప్పుడే ఆ క్షణాలు అర్థవంతంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఇతరుల కోసం కాకుండా, మనకు మనం నిజాయతీగా ఉండటం, మనల్ని మనం గౌరవించుకోవడం అత్యంత ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారానే సమాజంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదుగుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శోభిత అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే, ఇటు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ అందరికీ స్ఫూర్తినిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

