Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు!

నేడు ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు!

వార్త 1 week ago

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు వాతావరణం మారనుంది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (AP SDMA) వెల్లడించింది.

వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడొచ్చు. ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే వీలుందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

Read Also : Telangana Ration Card: ఈ-కేవైసీకి మరో రెండు రోజులే గడువు!

 Heavy rains in several districts of AP today!

AP Rain Alert: కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా చల్లటి వాతావరణం

ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ పరిధిలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే వీలుంది. అదేవిధంగా రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ చల్లటి వాతావరణం నెలకొని, వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రైతులకు, ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు

వర్షాలతో పాటు పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని AP SDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని కోరారు.

రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోవైపు, ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల వర్షాకాలపు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ కాచి వడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎల్నినో వల్ల భారీ నష్టాలు తప్పవు - చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha