TGPSC AEE Notification: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (Telangana Pollution Control Board) పరిధిలో ‘అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్’ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ నెం. 02/OG/PC/2026ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 10, 2026 నుంచి ఆన్లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
read also: Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్
విద్యార్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు రుసుము పూర్తి వివరాలు ఇవే!
కావలసిన అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్, మెకానికల్, కెమికల్, బయో-టెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగాలలో బీఈ లేదా బీటెక్ (Bachelor Degree) పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు ఏఎంఐఈ (ఇండియా) సివిల్ పరీక్షలో పాసైన వారు లేదా ఏదైనా ఇంజినీరింగ్ స్ట్రీమ్లో డిగ్రీ పూర్తి చేసి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.
TGPSC AEE Notification: వయోపరిమితి:
జులై 1, 2026 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. అలాగే దివ్యాంగులకు (PH) 10 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఫీజు మరియు అప్లికేషన్ ప్రాసెస్:
అర్హులైన అభ్యర్థులు జులై 17, 2026వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ (OTR) ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాతే లాగిన్ ఐడీ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా రూ.120 పరీక్ష ఫీజు ఉంటుంది. అయితే నిరుద్యోగ అభ్యర్థులకు ఈ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం, సిలబస్ మరియు జీతభత్యాల వివరాలు:
ఎంపిక ప్రక్రియ మరియు వేతనం:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో సాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) లేదా ఓఎంఆర్ (OMR) రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది నియామకాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.1,33,630 వరకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. కాగా, ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
రాత పరీక్ష విధానం:
ఈ రిక్రూట్మెంట్ పరీక్ష మొత్తం రెండు పేపర్లలో 450 మార్కులకు జరుగుతుంది. ఇందులో పేపర్-1 కింద ‘జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్’కు 150 మార్కులు, పేపర్-2 కింద ‘సివిల్ ఇంజినీరింగ్ (డిగ్రీ స్థాయి)’ సబ్జెక్టుకు 300 మార్కులు కేటాయించారు. క్వాలిఫైయింగ్ మార్కుల విషయానికి వస్తే.. ఓపెన్ కేటగిరీ (OC) అభ్యర్థులు కనీసం 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 30 శాతం కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

