Dailyhunt
ఓటు వేసేందుకు చెన్నై వచ్చిన నటుడు అజిత్ కుమార్

ఓటు వేసేందుకు చెన్నై వచ్చిన నటుడు అజిత్ కుమార్

వార్త 1 week ago

Ajith Kumar Returns to Chennai for Voting: తన స్టైల్, నటనతోనే కాకుండా క్రమశిక్షణతోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అజిత్ కుమార్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (ఏప్రిల్ 23) నేపథ్యంలో ఆయన విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు.

Read Also:JD Chakravarthy: స్టార్ హీరోలు అందుకే భయపడతారు.. ఇండస్ట్రీపై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్!

Ajith Kumar Returns to Chennai for Voting: షూటింగ్ విరామంలో స్వదేశానికి..

ప్రస్తుతం అజిత్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ మరియు అంతర్జాతీయ రేసింగ్ పోటీల నిమిత్తం బెల్జియంలో ఉన్నారు. అయితే, ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం తన ప్రాథమిక బాధ్యతగా భావించిన ఆయన, పనులన్నింటినీ పక్కన పెట్టి మంగళవారమే చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.

తిరువన్మియూర్‌లో ఓటు

అజిత్ కుమార్ చెన్నైలోని తిరువన్మియూర్ నియోజకవర్గ పరిధిలో ఓటరుగా నమోదయ్యారు. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అజిత్ రాకతో ఆయన నివాసం వద్ద మరియు పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

అభిమానుల ప్రశంసలు

“ఎంత బిజీగా ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఓటు వేయడానికి రావడం నిజమైన హీరో లక్షణం” అంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సామాన్య ప్రజలకు కూడా ఓటు హక్కుపై అజిత్ నిర్ణయం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'పెద్ది'లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha