Flight Trip for Students: నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి, వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించారు.

Read Also : Biogas : బయోగ్యాస్ వైపు అడుగులు వేయాలి!
Flight Trip for Students: గన్నవరం నుంచి హైదరాబాద్కు గగన విహారం
‘కలలకు రెక్కలు’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సౌమ్య మంగళవారం ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వారితో కలిసి విమానంలో హైదరాబాద్కు పయనమయ్యారు. విమానం ఎక్కడం అంటే కేవలం ధనికులకే సాధ్యమని భావించే పేద విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు.

ద్యార్థులతో కలిసి సరదాగా..
తొలిసారి విమానం ఎక్కిన విద్యార్థుల ముఖాల్లోని ఆనందం చూసి ఎమ్మెల్యే సౌమ్య మురిసిపోయారు. విమాన ప్రయాణ అనుభవం గురించి వారితో ముచ్చటించారు. హైదరాబాద్ చేరుకున్నాక అక్కడ సందర్శనీయ స్థలాలను చూసి, సాయంత్రం కారులో తిరిగి నందిగామకు చేరుకోనున్నారు. ఈ పర్యటన విద్యార్థులకు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే పట్టుదలను కూడా పెంచుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్వత్రా ప్రశంసలు
తమ పిల్లల కలను నిజం చేసినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే సౌమ్యకు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధిగా విద్యార్థుల చదువు పట్ల, వారి ఉన్నతి పట్ల ఎమ్మెల్యే చూపుతున్న ఈ చొరవను స్థానిక ప్రజలు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల మరింత బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే సౌమ్య చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

