PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్

PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్

వార్త

వార్త

56d

Loading...

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గిన పాక్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌ (PAK vs USA) లోనూ అమెరికాపై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ గెలుపుతో గ్రూప్-ఏలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 190 పరుగులు చేయగా.. అమెరికా 158 పరుగులే చేసి ఓటమిపాలైంది.

Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన మొనాంక్ పటేల్.. మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.'మేం పవర్‌ప్లేలో బాగానే బౌలింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేకపోయాం. చివరి నాలుగు ఓవర్లలో పేసర్లు బాగా బౌలింగ్ చేయడంతో తిరిగి మ్యాచ్‌లోకి వచ్చాం. పాకిస్థాన్ 190 పరుగులు చేసినా మేము రేసులోనే ఉన్నాం.

అనవసర ఒత్తిడికి లోనయ్యాం

పవర్‌ప్లేలో బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడలేకపోయాం.బ్యాటింగ్ చేసేటప్పుడు మాలో ఆ పట్టుదల కనిపించలేదు. పాక్ స్పిన్నర్లు వేగం తగ్గించి బౌలింగ్ చేయడంతో బౌండరీలు కొట్టడం కష్టమైంది. దాంతో మేం అనవసర ఒత్తిడికి లోనయ్యాం. అదే మా ఓటమిని శాసించింది. గత 12-15 నెలలుగా మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం.

ఈ మ్యాచ్‌కు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో వచ్చాం. మ్యాచ్‌లో కొన్ని పొరపాట్లు జరిగాయి.ఈ వరల్డ్ కప్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టోర్నీని బలంగా ముగించాలనుకుంటున్నాం. వేర్వేరు వేదికలపై ఆడటం అంత సులువు కాదు. ఇప్పుడు మేం చెన్నై వెళ్తాం. అక్కడ మాకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మరింత బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తాం.'అని మోనాంక్ పటేల్‌ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

T20 World Cup: అమెరికాపై పాకిస్థాన్ ఘన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha