Dailyhunt
పమిడిముక్కలలో చెక్కులు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

పమిడిముక్కలలో చెక్కులు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

వార్త 1 week ago

May Day 2026: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

Read Also:Vizianagaram: ఆర్టీసీ బస్సులో సీటు గొడవ.. 14 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం!

May Day 2026: సంక్షేమ స్టాళ్ల పరిశీలన

ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడం, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆయన పరిశీలించారు.

‘నైపుణ్యం పోర్టల్’తో అనుసంధానం

కార్మికులకు మెరుగైన ఉపాధి మరియు సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం వినూత్న మార్పులు చేపట్టింది. ఈ క్రమంలోనే:

  • స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మెప్మా, వైద్యారోగ్యం, పౌర సరఫరాల శాఖలను ‘నైపుణ్యం పోర్టల్’తో అనుసంధానం (Integration) చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
  • దీనివల్ల కార్మికుల నైపుణ్య గణన, ఉపాధి కల్పన మరింత సులభతరం కానుంది.

కార్మికులకు ఆర్థిక భరోసా

కార్యక్రమంలో భాగంగా పీ4 (P4) పథకం కింద 35 మంది భవన నిర్మాణ కార్మికులకు ముఖ్యమంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యే కుమార్ రాజా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha