Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కళ్యాణ్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

పవన్ కళ్యాణ్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

వార్త 1 week ago

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల వ్యవహారం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్సెస్ కల్వకుంట్ల కవితగా మారి సరికొత్త వివాదానికి తెరలేపింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ‘కోటిచెరువు’ శిఖం భూమిని పవన్ కల్యాణ్ కబ్జా చేశారంటూ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) సీనియర్ నేత కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. పవన్ గనుక ఆ భూమిని ఆక్రమించలేదని చెబితే, వెంటనే ఆ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి, అక్కడి అక్రమ నిర్మాణాలను, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు.

Read Also : Harish Rao counters Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డివి "మతిలేని మాటలు".. హరీశ్ రావు

 Kalvakuntla Kavitha’s sensational allegations against Pawan Kalyan

Kalvakuntla Kavitha: 10 ఎకరాల శిఖం భూమి మాయం!

నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం ఆ 10 ఎకరాల భూమి పూర్తిగా ‘శిఖం’ (ప్రభుత్వ చెరువు) భూమి అని కవిత స్పష్టం చేశారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా చూపి, మిగిలిన 7 ఎకరాలను ‘మాగాణి’ (ప్రైవేట్) భూమిగా నిబంధనలకు విరుద్ధంగా మార్చేశారని.. ఇది స్పష్టమైన ఉల్లంఘనే అని ఆమె ఎండగట్టారు. ఇటీవల పవన్ చేసిన “తెలంగాణ మీ అబ్బ సొత్తా.. మీ జాగీరా?” అనే వ్యాఖ్యలపై కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. “అవును, ఇది కచ్చితంగా మా జాగీరే! 1,200 మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఇది. ఇది తెలంగాణ ప్రజల సొత్తు, ఎవరి ముత్తాతలదో కాదు” అని కవిత ప్రతిస్పందించారు.

రాజధాని కట్టలేని పవన్.. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో కనీసం సొంత రాజధానిని కూడా నిర్మించలేకపోయిన పవన్.. ఇప్పుడు తెలంగాణలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సరైన స్థానిక నాయకులు లేకపోవడం వల్లే పవన్‌ను ఇక్కడ వాడుకుంటున్నారని విమర్శించారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్‌కు తాను కారు కొనిచ్చి సాయం చేశానన్న పవన్ వ్యాఖ్యలను కూడా కవిత తప్పుబట్టారు. నైజాం ఏరియా నుంచి తన సినిమాల ద్వారా కోట్లాది రూపాయల రెవెన్యూ సంపాదిస్తున్న పవన్.. ఇక్కడి జానపద కళాకారులను గానీ, చిన్న నిర్మాణాత్మక శక్తులను గానీ ఎప్పుడైనా ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. పైగా జానపద కళాకారుల ట్యూన్లను వాడుకుంటూ వారికి కనీస గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.

అప్పుడు KTR పాలన.. ఇప్పుడు కూడా KTR పాలనే!

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. “అప్పట్లో K.T.R (కేసీఆర్, టి. హరీశ్ రావు, రామారావు) పాలన అనుకుంటే.. ఇప్పుడు కూడా నడుస్తోంది KTR (కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి) పాలనే” అంటూ వ్యగ్యంగా కామెంట్ చేశారు. గత ప్రభుత్వం దోపిడీకి కిటికీలు తెరిస్తే… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తలుపులే బార్లా తెరిచిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇలాగే అమ్మేసుకుంటూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదని, ఈ ల్యాండ్ స్కామ్‌లన్నింటినీ తాము త్వరలోనే బయటపెడతామని కవిత హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha